
వినాయకుడు నేను అంత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే దేముడు, వినాయక చవితి వచ్చేంత వరకు గణేషుని ప్రతిష్టించి పిల్లలతో ఫూజ చేయించేంత వరకు చాలా బాగుంటుంది,
తరువాతే ప్రారంభమవుతుంది అసలు కథ వినాయకుడి కథ కన్నా వింతైనది వూరంతా వినాయకులే గణేషుని పేరుతో చందాలు వసూలు చేసి రోడ్డుకి అడ్డంగా పందిరేసి ప్రతిష్టించడం వరకు పర్లేదు, పొద్దున్నే మంత్రాలు బాగానే వినిపిస్తాయి. తరువాత మొదలవుతుంది సినెమా పాటల గోల అవి దాటామా,మూడో రోజు నుండి నిమజ్జనం పేరుతో జరిగే తంతు,
చావు డప్పులతో పిచ్చి గెంతులతో బాగ తాగేసి వూగిపోయే కుర్రకారుని చూసి భగవంతుడు ఎలా ఓర్చుకుంటున్నాడా అనిపిస్తుంది.
రాత్రంతా డప్పుల గోలే చిన్న పిల్లలు బి పి వున్న పెద్దవాళ్ళు పడే అవస్థ అంతా ఇంతా కాదు. ఇది వరకు మూడో రోజు పదో రోజు అని వుండెవి ఇప్పుడు ప్రతిరోజు నిమజ్జనమే.
ఒకరికి మించి ఒకరు పెట్టే విగ్రహాలు కొండంత దేముడికి కొండంత పూజ చేయగలమా, ఎందుకు ఎటికేడు విగ్రహాల సంఖ్య సైజు పెంచేస్తున్నారు.
పర్యావరణం కాలుష్యమమై పోతుంది, ఈ పెద్ద విగ్రహాల
వెల్లువలో జలమంతా కాలుష్యమమై పోతుంది,దెముడు భక్తితో పూజించమన్నాడు, అంతే కాని కాలుష్య సారంలొ ముంచమన్నడా.
ఫెద్ద విగ్రహాల తయారి నిషేదించాలంటె వాటి తయారీ లో ఎందరో బ్రతుకుతున్నారని నిస్సహయత ప్రదర్శిస్తుంది ప్రభుత్వం.
మనం మారాలి మన పిల్లలని మార్చాలి నిజమైన భక్తి ష్రద్దలంటె ఎంటొ వారికి నేర్పించాలి
ఏటా జరిగే నిమజ్జనాలలో పెద్ద విగ్రహాలతో పాటు నీట మునిగి చనిపోయే యువకుల తల్లిదండ్రుల మనశ్శాంతికై గణేషుని ప్రార్దిస్తూ, ఈ ఏడాది అపశ్రుతులు జరగొద్దని ఆశిస్తూ,
భారతి
1 comment:
బాగాచెప్పారండి!
Post a Comment