Tuesday, August 17, 2010

శ్రీ అరబిందో తన భార్య మృణాళినికి రాసిన లేఖలోని కొన్ని అంశాలు


ఆగుస్ట్ 15 అరబిందో జన్మదినం సందర్భంగా ఆయన రాసిన ఒక లేఖ.
ఆ మధ్య, శ్రీ అరబిందో తన భార్య మృణాళినికి రాసిన ఒక లేఖ చదవటం జరిగింది. అరబిందో, మృణాళినిల పయనం చివరి వరకు సాగలేదు. ఎన్నో విబేధాలు ఉండేవట. ఒక వైపు అరబిందో అందరిని స్వాతంత్రోద్యమం వైపు, భారత దేశపు వేదాంతం, ఆద్యాత్మికత వైపు మళ్ళిస్తూ ఉంటే, మృణాళని తన భర్తని ఎవరో కొందరు తప్పు దోవలో నడిపిస్తున్నారు అని అనుకునేదట. ఆమె సహకారం కోసం అరబిందో చాల ప్రయత్నమే చేసారని నాకు ఈ లేఖ చదివాక అనిపించింది. అరబిందో ధర్మంలో ఆమె పాలు పంచుకోకపోవటం విషాదమే. బెంగాలి లేఖని ఆంగ్లంలోకి తర్జుమా చేసారు. ఆ లేఖ కొంచెం సుధీర్గమే అందులో నాకు మరీ నచ్చిన కొన్ని అంశాలు తెలుగులో ఇక్కడ మీ కోసం.

30 ఆగస్ట్ 1905,

ప్రియమైన మృణాళినికి,
మీ తల్లితండ్రులు మరోసారి అదే బాధలోకి జారటం నాకు విశాదం కలిగించింది. వారి ఏ పుత్రుడు చనిపోయినారో నీవు తెలుపలేదు. బాధ వచ్చినప్పుడు చేయగలిగింది మాత్రం ఏముంది? ఈ ప్రపంచంలో, నీవు సంతోషాన్ని కోరుకున్నప్పుడల్లా, బాధే ఎదురవుతుంది, ఆ బాధ ఎల్ల వేళల సంతోషం కోసం ప్రాకులాడుతునే ఉంటుంది. నిర్మలమైన హృదయంతో, సంతోషాన్ని, బాధని, దేవుని పాదాల దగ్గర పెట్టటం ఒకటే మార్గం.ఈ పాటికే నీకు తెలిసి ఉంటుంది, ఎలాంటి విధి గల వ్యక్తితో నీ జీవితం ముడిపడి ఉందో. నేను ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రజలలోకి భిన్నమైన వాడినని, నాకు అందరిలాంటి ఆచరణ, ఆలోచన సరళి, మనస్తత్వం లేదని, నా జీవిత ధ్యేయం వేరని. విలక్షణమైన భావాలు, అసాధారణమైన లక్ష్యం, నిర్దేశపూర్వకమైన ఉద్దేశాలు ఉన్న నన్ను అందరు పిచ్చివాడు అనుకుంటారు. ఆ పిచ్చితనమే విజయం సాధించిన రోజు, ఇంకా దాన్ని పిచ్చితనం అనరు, గొప్ప జ్ఞాని అంటారు. కానీ ఎంతమంది విజయాన్ని చూడగలరు? వెయ్యిలో ఐదారుగురు అసాధారణమైన వాళ్ళు ఉంటారు. ఆ ఐదారుగురిలో ఒకరు విజయం సాధించాగలరేమో.

ఆడవారి అంచనాలన్నీ, ప్రపంచీకరమైన సుఖ సంతోశాలతోనే బంధించి ఉంటాయి. నాలాంటి పిచ్చి వాళ్ళు భార్యని సంతోష పెట్టలేరు. పైగా దుఃఖాన్ని కలిగిస్తారు. ఈ కష్టాన్ని, మహర్షులు ఒక ఉపదేశంతో పరిష్కరించారు. అదే 'పతియే పరమ గురువు' . భర్త ధర్మాచరణలో భార్య పాలుపంచుకుని, అతని సంతోషంలో సంతోషాన్ని, దుఃఖంలో దుఃఖాన్ని పొందగలగాలి. కార్యాచరణకి సహాయపడి, ఉత్సాహ పరచగలగాలి. ఈ పిచ్చి వాడితో నీ పెళ్లి పూర్వ జన్మ కర్మ ఫలం అయ్యి ఉంటుంది. విధితో ఒప్పందం కుదుర్చు కోవటం మంచిది. కానీ ఎలాంటి ఒప్పందాన్ని ఎన్నుకుంటావు? అందరిలానే నీవు కూడా నన్ను పిచ్చివాడు అనుకుని తప్పుకుంటావా? పిచ్చివాడు బలవంతుడు, తను ఎంచుకున్న దారిలోనే పరిగేడతాడు. నువ్వు ఆపలేవు. అందుకని ఏడుస్తూ ఒక మూల కుర్చుంటావా? లేక ఈ పిచ్చివాడితో పాటు పరిగెత్తుతావ? కళ్ళులేని రాజుగారి భార్య కళ్ళకి గంతలు కట్టుకున్నట్లు, నీవు ఈ పిచ్చివానికి ఒక పిచ్చి భార్యగా ఉండగలవా?

నా పిచ్చి మూడు విధాలు. మొదటిది, నా విజయాలు, విజ్ఞానం, ఉన్నత విద్య, సంపద అన్నీ దేవుడివే, నా అవసరాలకు సరిపడా వాడుకుని మిగితావి ఆయనకీ తిరిగి ఇచ్చేయాలి. పశువులు కూడా పొట్ట నింపుకోవటానికి, కుంటుంబ అవసరాలు తీర్చటానికే కష్టపడుతాయి. నాకు నేను ఒక పశువులాగా, ఒక దొంగలాగ అనిపిస్తున్నాను. దేవుడికి ఇవ్వటం అంటే, మంచి పనులు చేయటమే. ఇతరులకి సహాయపడటం ఒక పవిత్ర కర్మ. శరణు అన్నవాళ్ళని కాపాడటం అంతకన్నా గొప్ప కర్మ. తోడబుట్టిన వాళ్ళకి సహాయం చేయటం ఒకటే కాదు, దేశమంతా నా తోడబుట్టిన వాళ్ళే. నీవేమంటావు ? నాతో వస్తావా? నా ఆశయాన్ని పంచుకుంటావా? మనం ఎంతవరకి అవసరమో అంతే వాడుకుని మిగితాది దేవుడికి ఇద్దాము. నీనేమి అభివృద్ధి చెందలేదని నీవు అంటుంటావు. ఇప్పుడు అభివృద్దికి ఒక దోవ చెప్తున్నాను. ఆ దోవలో నీవొస్తావా?

నా రెండో పిచ్చితనం ఈ మధ్య నన్ను కట్టిపడేస్తోంది, అదేంటంటే, ఏదో ఒకరకంగా నాకు ఆ భగవంతుని ప్రత్యక్ష దర్శనం కలుగుతోంది. ఈ రోజుల్లో మతమనేది సమయం సందర్భం లేకుండా దైవ స్మరణం చేయటం లేదా అందరిలో దైవ ప్రార్థన చేయటం లేదా దేవుని పట్ల బాహాటంగా భక్తీ శ్రద్దలు చూపటం వరకే పరిమితం. నాకు ఇవేమీ ఒద్దు. దైవమంటూ ఉంటే, ఆయన ఉనికిని అనుభవించే మార్గం కూడా ఉంటుంది. ఎంత కష్టమైనా అదే మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఈ మార్గంలోకి నిన్ను తెచ్చుకోవాలని ఉంది. ఎవరు నిన్ను ఇందులోకి లాగాలేరు. ని ఇష్టపూర్వకంగా నీవే రాగాలగాలి.

నాకున్న మూడో పిచ్చితనం, అందరు దేశాన్నిమైదానాలు, అడవులు, కొండలు, నదులు ఉన్న ఒక ప్రదేశంగా చూస్తే నేను మాత్రం తల్లిగా ఆరాధించి పూజిస్తాను. రాక్షసులు రొమ్ముపై కూర్చుని తల్లి రక్తాన్ని పీలుస్తుంటే, ఏ కొడుకైనా ఏమి చేస్తాడు? తీరిగ్గా కూర్చుని, భోంచేసి, ఆనందిస్తూ గడుపుతాడా లేక తల్లిని విడిపించటానికి ప్రయత్నం చేస్తాడా? నాకు తెలుసు, ఈ దిగజారిన జాతిని విడిపించగల బలం నాలో ఉందని. అది కండబలం కాదు. నా విజ్ఞాన బలం.

భార్య అంటే శక్తి, భర్తకి ఉన్న బలం. నీ దయతో ఆ బలాన్ని రెట్టింపు చేస్తావా లేక నాతొ విభేదిస్తావా? నీవంటావేమొ, గొప్ప విషయాలతో నాలాంటి సాధారణ మహిళ చేయగలిగింది ఏముంది, నాకంతటి బలము, తెలివి ఎక్కడివి, ఆలోచించటానికే భయంగా ఉందని. కానీ దానికి మార్గం ఉంది. దైవాన్ని శరణు వేడుకో భయం తేలిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళ మాటలేవి వినకుండా, కేవలం నా ఒక్కడి మాటలే వింటే, నా శక్తి నంతా నీకు ఇస్తాను. దానితో నా శక్తి తరిగిపోదు పైగా రెట్టింపు అవుతుంది. నీలో ఒక లోపం వుంది. ఎవరు ఏది చెప్పినా వినేస్తావు. అది నీ మెదడుని విశ్రాంతి తీసుకొనివ్వదు. నీ విజ్ఞానం పెరగనివ్వదు, పని మీద శ్రద్ధ నిలుపనీయదు. ఒకరి మాట విని జ్ఞానాన్ని పెంపుచేసుకో, మారిన ఆలోచనలతో ఏకాగ్రత సాధించి, ఒక ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాదించటం కోసం పని చేయి. ఇంకో లోపం వుంది, అది ఒక్క నీలోకాదు, ప్రజలందరిలో ఉన్నది. మతం, మానవత్వం, ఉన్నత ఆశయాలు, దేశ విముక్తి లాంటి తీవ్రమైన విషయాల గురించి వినే శక్తి లేదు. ఈ విషయాలన్నీహాస్యాస్పదం అనుకుంటారు. ఇలాంటి ప్రవర్తనని స్థిరమైన ఆలోచనతో వ్యతిరేకించాలి. ఒకసారి ఆలోచించటం మొదలు పెడితే, నీ నిజ ప్రవర్తన వికసిస్తుంది. సహజంగానే, వేరే వాళ్లకి సహాయం చేయటానికి, త్యాగానికి ముందుకు వస్తావు. ఇంకో లోపం కూడా వుంది, నీ మెదడుకి శక్తి లేదు. అది దేవుణ్ణి ఆరాదిస్తే వస్తుంది. ఇవన్ని నేను నీతో చెప్పాలనుకున్నాను. నీవు ఎవరికీ చెప్పొద్దు. నిశబ్దంగా నేను చెప్పిన వాటి గురించి ఆలోచించు. 'నా భర్త దారికి నేను ఆటంకం కాకూడదు, తనకి సహాయకురాలిగా, ఒక వాహకంగా నేను మారాలి' అని దేవునికి నీవు రోజు ప్రార్థన చెయగలవా?

నీ వాడు.