Tuesday, September 28, 2010

మరువలేని రోజులు మరల రాని రోజులు


గుర్తుకొస్తున్నాయి అంటు ఏమైనా రాయాలంటే, గూడంటే గూడూ కాడు మేడంటే మేడా కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది అనే పాట కి ప్రతిరూపం మా ఇల్లు, నిజంగా పొదరిల్లు మాదిరే ఇంటి ముందు పందిరి వుండెది, సన్నజాజులు రాధామనొహరాలు మాధవిలత కలగలిపి అల్లుకున్న పందిరి, ఇంక అమ్మ పెంచిన తోట గులాబీలు లిల్లీలు మల్లెలు, వీటన్నింటితో పాటు మేము ముగ్గురం అమ్మాయిలం కలిసి పెరిగాం.


అతి గారాబం చేసే నాన్న, అదుపులో పెంచాలని చూసే అమ్మ, కస్టమంటే తెలియకుండా ఎప్పుడు పెరిగిపోయమో కాలానికే కాని మాకు తెలియదు,ముగ్గురం చాలా ఫొడవుగా వుండటం తో ఎంతో పెద్దవాళ్ళమైపొయామని భావించే వాళ్ళు అందరు.

అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ముగ్గురిని వదిలేసి వెళ్ళేది. అప్పుడొచ్చేది కొట్టుకునే స్వేచ్చ అందరి గిల్లికజ్జాలూ తీరేలా కొట్టేసుకుని అమ్మొచ్చేసరికి గప్ చిప్ ఐపోయేవాళ్ళం, ఇక్కడొ విషయమేంటంటె మా చిన్ని రాక్షసి మాత్రం దెబ్బలాటలో గొంతు పెంచి ఏడ్చి చీమిడి ముక్కుతో దుబ్బు తలతో నాన్న పనిచేసే మిల్లు పక్కనే వుండటం తో నాన్న దగ్గరికి వెల్తా అని పరిగెత్తేది, ఇంక తనని పట్టుకుని బ్రతిమిలాడి ఎంత చేసినా
అమ్మొచ్చే దాకా ఏడుస్తూనే వుండేది ఇంకేముంది అమ్మతో అందరికి పడెవి తన్నులు,ఐనా అల్లరి మానేవాళ్ళమా.

ఎప్పుడూ ఆటలే పక్కన వెంకట లక్ష్మి ఆంటి పిల్లలు ముగ్గురు మేము మొత్తం ఆరుగురితో పెరడంతా హోరెత్తిపోయేది, ఎప్పుడు పెద్దవాళ్ళ్మయ్యామో తెలియదు, ఒకరోజు హటాత్తుగా నేను ఇంటికొచ్చే సరికి ఇంట్లొ ఎవరో కూర్చుని వున్నారు ఆ అంటు నోరు తెరుచుకు వెళ్ళిన నాకు అతనే పెళ్ళికొడుకు వారం రోజుల్లో నీ పెళ్ళి అని చెప్పారు, దాంతో బలవంతంగా బాల్యానికి గుడ్ బై చెప్పి హైదరాబాద్ వచ్చిపడ్డాను.



కొసమెరుపేంటో చెప్పాలా మా చిన్నికి ఇంకో బుల్లి రాక్షసి పుట్టి అచ్చు తను ఏడ్చినట్లే పెద్ద గొంతుకేసుకుని ఏడుస్తూ తను మామీద ఎలా సాగించుకునేదో అచ్చు తనమీద అలా సాగించుకుంటుంది హి హి హి.



భారతి

Monday, September 20, 2010

వినాయక నిమజ్జనం


వినాయకుడు నేను అంత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే దేముడు, వినాయక చవితి వచ్చేంత వరకు గణేషుని ప్రతిష్టించి పిల్లలతో ఫూజ చేయించేంత వరకు చాలా బాగుంటుంది,

తరువాతే ప్రారంభమవుతుంది అసలు కథ వినాయకుడి కథ కన్నా వింతైనది వూరంతా వినాయకులే గణేషుని పేరుతో చందాలు వసూలు చేసి రోడ్డుకి అడ్డంగా పందిరేసి ప్రతిష్టించడం వరకు పర్లేదు, పొద్దున్నే మంత్రాలు బాగానే వినిపిస్తాయి. తరువాత మొదలవుతుంది సినెమా పాటల గోల అవి దాటామా,మూడో రోజు నుండి నిమజ్జనం పేరుతో జరిగే తంతు,

చావు డప్పులతో పిచ్చి గెంతులతో బాగ తాగేసి వూగిపోయే కుర్రకారుని చూసి భగవంతుడు ఎలా ఓర్చుకుంటున్నాడా అనిపిస్తుంది.

రాత్రంతా డప్పుల గోలే చిన్న పిల్లలు బి పి వున్న పెద్దవాళ్ళు పడే అవస్థ అంతా ఇంతా కాదు. ఇది వరకు మూడో రోజు పదో రోజు అని వుండెవి ఇప్పుడు ప్రతిరోజు నిమజ్జనమే.

ఒకరికి మించి ఒకరు పెట్టే విగ్రహాలు కొండంత దేముడికి కొండంత పూజ చేయగలమా, ఎందుకు ఎటికేడు విగ్రహాల సంఖ్య సైజు పెంచేస్తున్నారు.

పర్యావరణం కాలుష్యమమై పోతుంది, ఈ పెద్ద విగ్రహాల
వెల్లువలో జలమంతా కాలుష్యమమై పోతుంది,దెముడు భక్తితో పూజించమన్నాడు, అంతే కాని కాలుష్య సారంలొ ముంచమన్నడా.

ఫెద్ద విగ్రహాల తయారి నిషేదించాలంటె వాటి తయారీ లో ఎందరో బ్రతుకుతున్నారని నిస్సహయత ప్రదర్శిస్తుంది ప్రభుత్వం.
మనం మారాలి మన పిల్లలని మార్చాలి నిజమైన భక్తి ష్రద్దలంటె ఎంటొ వారికి నేర్పించాలి

ఏటా జరిగే నిమజ్జనాలలో పెద్ద విగ్రహాలతో పాటు నీట మునిగి చనిపోయే యువకుల తల్లిదండ్రుల మనశ్శాంతికై గణేషుని ప్రార్దిస్తూ, ఈ ఏడాది అపశ్రుతులు జరగొద్దని ఆశిస్తూ,




భారతి