Monday, September 1, 2014

సెలవంటూ వెళ్ళిన రాతని వెతుక్కుంటు గీత వెళ్ళింది (బాపురమణీయం)



ఒక రాత ఒక గీత చెలిమి చేసాయి. ఒకటిగ ఉన్నాయి నువ్వు రాస్తే నేను గీస్తాను, నువ్వు గీస్తేనే నేను రాస్తాను
అనుకుని ఒకటిగ బ్రతికాయి . దేముడు ఏదో పనున్నట్లు రాతని ముందు పిలిచాడు. దేముడే పిలిచాక వెళ్ళక తప్పదుగ అని రాత, గీతకి వీడ్కొలు చెప్పి దేముడి దగ్గరకెల్లింది.

పాపం ఒంటరైన గీత కొన్నాళ్ళు అటు ఇటు చూసి ఎహె ఏం దేముడివి నువ్వు మమ్మల్నిలా విడదీయడమేంటి, ఒకరు లేకుండ ఒకరం ఎలా వుంటామనుకున్నావు. నేను వస్తున్నా ఉండూ అంటూ దేముడితో పోట్లాడి వెళ్ళింది.

అయ్యో ఇప్పుడు మనమేం చేద్దాం వాళ్ళిద్దరూ లేకుండా? కళకి అంతం వుండదు అంటారు కాని ముగింపు వుంటుంది అని తెలిసింది. వేలాది గీతలని రాతలని మనకి వదిలి వాళ్ళిద్దరు ఊసులాడుకోవడానికి ఒకచోట చేరారు.

--భారతి

No comments: