
Thursday, February 24, 2011
కలం గుండె ఆగింది

Saturday, February 19, 2011
'ప్లీస్ వినొద్దు ' -ఈ తరనికి నచ్చే ఒక మ్యూసిక్ ఆల్బం

Friday, December 31, 2010
కొత్త కొత్తగా వున్నది

ప్రక్రుతి కరుణిస్తేనే మన బ్రతుకు, ఈ జలరాశి, ఈ కొండలు కోనలు, చెట్లు చేమలు ఇవ్వన్ని లేకుండా మనమున్నామా ఏంటి.వరద వెల్లువెత్తితే రైతు బ్రతుకు తెల్లవారిపొతుంది, అయినా మనకి మనం మనుషులం పెద్ద తెలివిగలవాళ్ళం అనుకుంటాం కాని దేముడు ఇచ్చిన ప్రక్రుతి ముందు మనమెంత.
అందుకని మనమేదో సాధించేశాం, అని నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టెసుకుంటాం అదెంటో మరి, అదెంటంటె ఈ మనిషనేవాదు ఎప్పటికైన నశించాలి అందుకు చాలా విపరీతాలు చేస్తాడు అని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పాడంట.ఆయనెలాగు చెప్పాడు కాబట్టి మనందరం కొట్టుకుని నాశనమైపోదాం అని మనొళ్ళంతా తీర్మానం చేసెసుకున్నారు, అందులో నెనైతే లేను, నేను ఆశావాదిని 2010 పోతే 2011 లేదా 2011 పోతే 2012 రాదా అని బోల్డంత ఆశతో ఎదురుచుస్తాను.
ప్రతి రోజు కొత్తగా 2010 అనిపించింది ఎందుకంటె చాలా రోజుల తరువాతా ఇంట్లో పాప పుట్టింది దాని ముద్దు ముచ్చట్లతో ఈ ఏడాది గడిచిపోయింది. 2011 కూడా కొత్త ఆశలకి ఊపిరిపోస్తుందనిశ్రీక్రిష్ణ కమిషన్ నివెదిక సర్వత్రా అమోదయొగ్యంగా వుంటుందని, మనందరం మళ్ళి సంతోషంగా 2012 కి స్వాగతం పలుకుతామని కలలుకంటూ నా కలలు నిజమవ్వాలని దేముడిని ప్రార్ధిస్తూ అందరికి,
నూతనసంవత్సర శుభాకాంక్షలు .
Friday, December 17, 2010
జీలకర్ర తో కుకీస్
ఈ మధ్య తీయటి కుకీస్ తిని చాలా బోర్ కొట్టేసింది. 'గుడ్ డే ' బిస్కట్లు బాగానే వున్నా, అవి కూడా చాలా బోర్.ఇంట్లో డానిష్ కుకీస్ వున్నాయి వాటికన్నా కూడా ఈ జీర కుకీస్ బాగున్నట్లనిపించాయి. ఇవాళ ఆఫీసులో అభిజీత్ పచారి కొట్లో కొన్న 'జీరా కుకీస్ ' తీసుకొచ్చాడు. అబ్బో అవి భలే బాగున్నాయి. మా గాన పెసూన లాగా, స్వీట్ నచ్చని హాట్ ప్రియులకి కూడా బాగా నచ్చేసేల ఎంతో రుచిగా ఉన్నాయి. ఐతే అవి పచారి కొట్లో కొనటం కన్న ఇంట్లో చెసుకుంటే ఇంకా బాగుంటయి అనిపించింది. అందుకే రెసిపి వెతికేసాను. తొందర్లో నేను కూడా ఇంట్లో తయారు చేయబోతున్నాను. ఇదిగో రెసిపి ఇక్కడ మీ అందరి కోసం. ఎవరైనా నా కన్నా ముందుగా చేసేస్తే ఎలా వచ్చాయో నాకు తప్పకుండా చెప్పండి.
కావలసిన వస్తువులు: 120 గ్రా వెన్న లెదా డాల్డా, 2 స్పూన్స్ పంచదార, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ జీలకర్ర, 1 కోడి గుడ్డు, 200 గ్రా మైదా1/2 స్పూన్ బేకింగ్ పౌడర్
చేసే విధానం:
1) వెన్న, పంచదర, ఉప్పు కలిపి వెన్న కరిగి తెలిక అయ్యేదాక బీట్ చేయాలి. ఎగ్, జీలకర్ర కూడ వేసి కలపాలి. ఈ మిశ్రమానికి, మైద కొద్ది కొద్దిగ చేరుస్తు, పింది గట్టిపడకుండ మెల్లిగ మ్రుదువుగ కలపాలి.
2) మిశ్రమాన్ని 15 నిమిషాలు చల్లారనివ్వాలి.
3) ఓవెన్ ని 180 డిగ్రీస్ దగ్గర ముందుగానె వేడి చేయాలి.
4) బేకింగ్ ట్రేకి వెన్న పూసి వుంచాలి.
5) పిందిని మందంగా పెద్దగా వత్తుకుని, కుకీ సైజ్ లో వున్న ఏదైన మూతతో, కుకీస్ కుట్ చేసి, ట్రే మీద అన్ని పేర్చి పైన మల్లి కొద్దిగ జీలకర్ర జల్లాలి.
6) 12-14 నిమిషాలు ఓవెన్లో బేక్ చేయాలి.
ప్రిపరేషన్ టైం : 20 నిమిషాలు.
ఇంపార్టంట్: నీళ్ళు వాడకుదదు, ఓవెన్ టెంపరేచర్, ఓవెన్ పవర్ని బట్టి సరి చేసుకోవాలి.
Friday, October 1, 2010
భయం గుప్పెట్లో మనం
దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు, అయోధ్య లో రామమందిరాన్ని కట్టించమని రాములవారు అడిగారా, రక్తపుటేరులు పారించి శవాల గుట్టలమీద మసీదు కూలగొట్టి రామ మందిరం కట్టారు, ఈ రోజు దేశమంతా భయం గుప్పెట్లో వుంది,
నీ పక్కవాడే నీకు శత్రువు ఐపోతాడు, హిందు ముస్లిమ్ భాయి భాయి నినాదమ్ మంట కలుస్తుంది, బెటాలియన్ల కొద్దీ పోలిసులు మీరు తప్పకుండా కొట్టుకోండి, అని చెప్పకనే చెప్తున్నట్లు కనిపిస్తుంది,
ఇది తెల్లారితే కె సి ఆర్ బెదిరిస్తున్నాడు, డిసెంబర్ తరువాత అటు చీమని ఇటు కూడా కదలనివ్వనని, అంతర్యుద్దం తప్పదని, సామాన్య ప్రజలకి పొద్దున లేస్తే బ్రతుకు బండి నడిపించడానికి ఎన్నో సమస్యలు, ఒక వైపు ధరలు ఇంకో వైపు వరదలు, తెల్లారితే పాలు దొరకవు నీళ్ళు రావు, కూరల ధరలకి రెక్కలొచ్చాయి, ఎలారా భగవంతుడా రోజు గడిచేది అని బ్రతుకుబండి లాగే సామాన్యులకి రోజుకో అదనపు సమస్య, చదువుకోమని పట్నం పంపించిన కొడుకు తెలంగాణా కోసం శవమై పోయాడని తెలిసిన తల్లి తండ్రులకి ఈ సో కాల్డ్ రాజకీయనాయకులు ఏం న్యాయం చేయగలరు.
ఎట్టకేలకు న్యాయమూర్తులు సమన్యాయం తీర్పు ఇచ్చారు, అలాగే తెలంగాణా విషయం లో కూడా సరైన న్యాయాన్ని జరిపించగలిగిన శక్తి శ్రీ క్రిష్ణ కమిటీకి వుండాలని దానికి ప్రజలందరు కట్టుబడి వుండాలని, ఈ భయం నీడ నుండి బయట పడీ పిల్లలందరు చక్కగా చదువుకోవాలని ఆశిద్దాం.
భారతి
Tuesday, September 28, 2010
మరువలేని రోజులు మరల రాని రోజులు

గుర్తుకొస్తున్నాయి అంటు ఏమైనా రాయాలంటే, గూడంటే గూడూ కాడు మేడంటే మేడా కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది అనే పాట కి ప్రతిరూపం మా ఇల్లు, నిజంగా పొదరిల్లు మాదిరే ఇంటి ముందు పందిరి వుండెది, సన్నజాజులు రాధామనొహరాలు మాధవిలత కలగలిపి అల్లుకున్న పందిరి, ఇంక అమ్మ పెంచిన తోట గులాబీలు లిల్లీలు మల్లెలు, వీటన్నింటితో పాటు మేము ముగ్గురం అమ్మాయిలం కలిసి పెరిగాం.
అతి గారాబం చేసే నాన్న, అదుపులో పెంచాలని చూసే అమ్మ, కస్టమంటే తెలియకుండా ఎప్పుడు పెరిగిపోయమో కాలానికే కాని మాకు తెలియదు,ముగ్గురం చాలా ఫొడవుగా వుండటం తో ఎంతో పెద్దవాళ్ళమైపొయామని భావించే వాళ్ళు అందరు.
అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ముగ్గురిని వదిలేసి వెళ్ళేది. అప్పుడొచ్చేది కొట్టుకునే స్వేచ్చ అందరి గిల్లికజ్జాలూ తీరేలా కొట్టేసుకుని అమ్మొచ్చేసరికి గప్ చిప్ ఐపోయేవాళ్ళం, ఇక్కడొ విషయమేంటంటె మా చిన్ని రాక్షసి మాత్రం దెబ్బలాటలో గొంతు పెంచి ఏడ్చి చీమిడి ముక్కుతో దుబ్బు తలతో నాన్న పనిచేసే మిల్లు పక్కనే వుండటం తో నాన్న దగ్గరికి వెల్తా అని పరిగెత్తేది, ఇంక తనని పట్టుకుని బ్రతిమిలాడి ఎంత చేసినా
అమ్మొచ్చే దాకా ఏడుస్తూనే వుండేది ఇంకేముంది అమ్మతో అందరికి పడెవి తన్నులు,ఐనా అల్లరి మానేవాళ్ళమా.
ఎప్పుడూ ఆటలే పక్కన వెంకట లక్ష్మి ఆంటి పిల్లలు ముగ్గురు మేము మొత్తం ఆరుగురితో పెరడంతా హోరెత్తిపోయేది, ఎప్పుడు పెద్దవాళ్ళ్మయ్యామో తెలియదు, ఒకరోజు హటాత్తుగా నేను ఇంటికొచ్చే సరికి ఇంట్లొ ఎవరో కూర్చుని వున్నారు ఆ అంటు నోరు తెరుచుకు వెళ్ళిన నాకు అతనే పెళ్ళికొడుకు వారం రోజుల్లో నీ పెళ్ళి అని చెప్పారు, దాంతో బలవంతంగా బాల్యానికి గుడ్ బై చెప్పి హైదరాబాద్ వచ్చిపడ్డాను.
కొసమెరుపేంటో చెప్పాలా మా చిన్నికి ఇంకో బుల్లి రాక్షసి పుట్టి అచ్చు తను ఏడ్చినట్లే పెద్ద గొంతుకేసుకుని ఏడుస్తూ తను మామీద ఎలా సాగించుకునేదో అచ్చు తనమీద అలా సాగించుకుంటుంది హి హి హి.
భారతి
Monday, September 20, 2010
వినాయక నిమజ్జనం

వినాయకుడు నేను అంత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే దేముడు, వినాయక చవితి వచ్చేంత వరకు గణేషుని ప్రతిష్టించి పిల్లలతో ఫూజ చేయించేంత వరకు చాలా బాగుంటుంది,
తరువాతే ప్రారంభమవుతుంది అసలు కథ వినాయకుడి కథ కన్నా వింతైనది వూరంతా వినాయకులే గణేషుని పేరుతో చందాలు వసూలు చేసి రోడ్డుకి అడ్డంగా పందిరేసి ప్రతిష్టించడం వరకు పర్లేదు, పొద్దున్నే మంత్రాలు బాగానే వినిపిస్తాయి. తరువాత మొదలవుతుంది సినెమా పాటల గోల అవి దాటామా,మూడో రోజు నుండి నిమజ్జనం పేరుతో జరిగే తంతు,
చావు డప్పులతో పిచ్చి గెంతులతో బాగ తాగేసి వూగిపోయే కుర్రకారుని చూసి భగవంతుడు ఎలా ఓర్చుకుంటున్నాడా అనిపిస్తుంది.
రాత్రంతా డప్పుల గోలే చిన్న పిల్లలు బి పి వున్న పెద్దవాళ్ళు పడే అవస్థ అంతా ఇంతా కాదు. ఇది వరకు మూడో రోజు పదో రోజు అని వుండెవి ఇప్పుడు ప్రతిరోజు నిమజ్జనమే.
ఒకరికి మించి ఒకరు పెట్టే విగ్రహాలు కొండంత దేముడికి కొండంత పూజ చేయగలమా, ఎందుకు ఎటికేడు విగ్రహాల సంఖ్య సైజు పెంచేస్తున్నారు.
పర్యావరణం కాలుష్యమమై పోతుంది, ఈ పెద్ద విగ్రహాల
వెల్లువలో జలమంతా కాలుష్యమమై పోతుంది,దెముడు భక్తితో పూజించమన్నాడు, అంతే కాని కాలుష్య సారంలొ ముంచమన్నడా.
ఫెద్ద విగ్రహాల తయారి నిషేదించాలంటె వాటి తయారీ లో ఎందరో బ్రతుకుతున్నారని నిస్సహయత ప్రదర్శిస్తుంది ప్రభుత్వం.
మనం మారాలి మన పిల్లలని మార్చాలి నిజమైన భక్తి ష్రద్దలంటె ఎంటొ వారికి నేర్పించాలి
ఏటా జరిగే నిమజ్జనాలలో పెద్ద విగ్రహాలతో పాటు నీట మునిగి చనిపోయే యువకుల తల్లిదండ్రుల మనశ్శాంతికై గణేషుని ప్రార్దిస్తూ, ఈ ఏడాది అపశ్రుతులు జరగొద్దని ఆశిస్తూ,
భారతి